శుక్రవారం, జనవరి 24

నేటిబడులు - గైడో పాధ్యాయులు

ఉదయము  ఎనిమిది  మొదలిడి  రాత్రియు 
              ఎనిమిది వరకును  ఏమి చెప్పొ ?
బడులందె పిల్లల్ని బందీలు  చేసేసి
              కూర్చుండ బెట్టుట కూర్మి యగున?
చదవడానికి  టైము సరిగాను ఈయకే 
              ఎగ్జామ్స్  పెట్టుచో  ఏమి వ్రాయు ?
రోజుకి  రెండేసి 'ఎగ్జామ్స్'  "పెట్టేసి 
           వ్రాయమనుట  ఎంత న్యాయ మగును?

మార్కు  తగ్గంగ  పేరెంట్లు  మంద లించు ,
 కోపమున కొట్టు  గురువులు కొరడ దెబ్బ
స్నేహితుల  మధ్య అవమాన సిగ్గులయలు 
చేటు చేస్తుండె  విద్యార్థి  చిన్న మనసు !

ముఖ్య మైనట్టి  ప్రశ్నలు ప్రోగు జేసి 
వత్స రమ్మంత వాటినే వల్లెవేసి 
వంద సారులు వానినే వ్రాయ మనుచొ 
మార్కులే కాని జ్ఞానమ్ము  మరుగు పడును !

పాఠ్య పుస్తక  పాఠాలు పటన  జేసి
తెలియ బోతేను అడిగియు తెలుసు కొనుచు 
స్వంతముగ నోట్సు వ్రాసెడి పద్ధ తిపుడు 
మరుగు పడిపోయె గైడుల  మహిమ చేత !

పాఠ్య గ్రంధాల నన్నిటిన్ ప్రక్క పెట్టి 
గైడులో నున్న ప్రశ్నలే  గ్రహణ జేయ ,
మార్కు లొచ్చును ,జ్ఞానంబు  మందగించు 
చదువు లందున కాన్సెప్ట్  చచ్చి పోవు!

గైడులే  నేటి  గురువుల  కల్ప వల్లి 
గైడు లేకుండ వెళ్ళరు క్లాసు కెపుడు 
గైడు నందలి విషయాలు కాపి కొట్టి 
బోర్డు నెక్కించు  వారలే బోధకులయె !
 


2 కామెంట్‌లు:

  1. Your LOKABHIRAMAM book is extraordinary.
    it expose our socity good values & every citizen directs right path towards moral valueslife
    poimms no:56,108 is highlet of your gifted,holi book you seem tobe modern VEMANA,BADDENA,BATRUHARI........mee sishyudu kommana surya prakasarao vizianagaram mob:9492617957

    రిప్లయితొలగించండి