ఆదివారం, నవంబర్ 27

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

ఒరే ! పంతులా ! అని నన్ను ఆప్యాయంగా పిల్చే ఏకైక మాస్టారు , మా శ్రీ క్రొవ్విడి రామం మాస్టారు.
B.A.BL. చేసి B.Ed, చేసి పార్వతీపురం బోర్డ్ హై స్కూల్ లో మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు. సోషల్ కన్నా అతనికి తెలుగులో పాండిత్యం ఉండేది. పిల్లల కోసం చాల పుస్తకాలూ రాసారు.  తన ఒక పుస్తకాన్ని ఘంటసాల కి కన్యాదానం చేసేరు అప్పుడు అడిఒక గొప్ప గా అనుకునే వాళ్ళం .బెలగం, సంజీవి క్వార్టర్స్ లో ఉండేవారు. పిల్లల్ని పిలచి తను వ్రాసిన పద్యాలు చదివి పద్యాలు ఎలా రాయాలో చెప్పేవారు.
నేనూ మాస్టారు అయేక , ఒక సారి తన దగ్గర పబ్లిక్ పరీక్షలకి ,ఇన్విజిలేషన్ చేసే భాగ్యం కలిగింది 
పరీక్షలు అన్నీ అయిపోయేక ఆఖరి రోజు , సరదాగా  ఇన్విజిలేషన్ ఎలావుంది మాస్టారు? అన్నా!
వెంటనే , ఆశువుగా ఒకా పద్యం చెప్పారు అది ఇన్విజిలేషన్ కి వెళ్ళినప్పుడల్లా చెబుతూ వుండే వాడ్ని.
అది మీ కోసం:
                         స్లిప్పులను యేరి చీపుగా స్వీపరయితి
                         పేర్మి విండోల కెగబడు పెద్ద లెల్ల      
                         వెడలె ; నేనింక హాయిగా విశ్ర మింతు
                         అనుభవించితి ప్రారబ్ధ మధ్బుతముగ ! 

ఆ తరువాత కొన్నేళ్ళకి ,  ఇన్విజిలేషన్ మీద నేను వ్రాసిన పద్యం కొత్త కలాల లో పాడు ఇన్విజలేషను- మాస్టర్ల దురవస్థ పేరుతొ మొదటి సారిగా అచ్చు అయింది అది మీ అందరి కోసం:

           స్లిప్పు పట్టు కొనుట చేత కాదంటినా - అధికారి నామీద అలుసు జేయు;
           తెచ్చిన స్లిప్పులన్ తీసేసు కొందునా - విద్యార్ధి లోకమ్ము విరగి పడును;
           పట్టి నట్టియు స్లిప్పు పారేసి వేస్తినా - పిరికి  వానిగ నేను పిలువ బడుదు;
          చూసి చూడనట్లు చూడ కుండున్టినా- ఆత్మాభి మానమ్ము యడ్డు తగులు;
                              ఖరము కంటెను మేమంతా కష్ట పడియు
                              మూడు గంటల సేపు మే  ముంటి మేని
                               రెండు రూపాయలయ్య మా రేటు కూలి              
                              వద్దు వద్దుర ఈ పాట్లు వద్దు మనకు !
పీ .య స్.: ఈ పద్యం అచ్చు అయేక కూలి నాలుగు రూపాయలు చేసేరు ప్రభుత్వం



;






1 కామెంట్‌:

  1. బావుంది గురువుగారు

    మీకు అవకాశం వుంటే మా టెక్నికల్ డిపార్టుమెంటు గురుంచి వ్రాయగలరు, వినపముతో మీ
    సుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి